- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
పెళ్లి ఊరేగింపు (బారాత్)లో పాల్గొనేందుకు స్కార్పియో వాహనంలో బిజ్నోర్కు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని హాపూర్ వద్ద ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్కు చెందిన కొందరు యువకులు పెళ్లి ఊరేగింపు (బారాత్)లో పాల్గొనేందుకు స్కార్పియో వాహనంలో బిజ్నోర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై అదనపు ఎస్పీ (ASP) వినీత్ భట్నాగర్ మాట్లాడుతూ.. గఢ్ ప్రాంతంలో హైవే దాటుతున్న ఒక జంతువు హఠాత్తుగా వాహనానికి అడ్డుగా వచ్చిందని తెలిపారు.
దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, స్కార్పియో మొదట ఆ జంతువును ఢీకొని, ఆపై డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో బిజ్నోర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న మరో కారును ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించి, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించామని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని మీరట్కు తరలించారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.






