- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు.. ఎన్నాళ్లకైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో చేయడమే నా కల: భాగ్యశ్రీ బోర్సే
కెరీర్ పరంగా తాను ఎలాంటి పెద్ద పెద్ద కలలు లేదా టార్గెట్లు పెట్టుకోలేదని ఆమె వెల్లడించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, తన అందం, నటనతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకోవడంతో పాటుగా స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ చిత్రంలో నటించి సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కెరీర్ పరంగా తాను ఎలాంటి పెద్ద పెద్ద కలలు లేదా టార్గెట్లు పెట్టుకోలేదని ఆమె వెల్లడించారు. తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని, జీవితంలో వచ్చే అవకాశాలను బట్టి ఫ్లోలో ముందుకు వెళ్లడమే తన విధానమని చెప్పారు. పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుంటే అనవసరమైన ఒత్తిడి, టెన్షన్ వస్తాయని, అందుకే చిన్న చిన్న టైమ్ లైన్స్ పెట్టుకుని ముందుకెళ్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, తనకు ఎన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ, తెలుగు చిత్రసీమలోనే సెటిల్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చివరికి తన కెరీర్లో చేసే ఆఖరి సినిమా కూడా తెలుగులోనే చేస్తానని చెప్పడం విశేషం. టాలీవుడ్లో దిగ్గజ దర్శకులు రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో పనిచేయడమే తన కోరికని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లు వరుస టార్గెట్లతో పరుగులు తీస్తుంటే, భాగ్యశ్రీ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతుండటం విశేషం.






