గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం

by Disha Web Desk 1 |
గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం
X

వేర్వేరు ఘటనల్లో ఐదుగురికి గాయాలు

దిశ, కామారెడ్డి రూరల్ : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై పలువరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల కథనం మేరకు.. ఫ్యాక్టరీలో నిత్యం కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ఫ్యాక్టరీ యజమాన్యం కార్మికులు పని చేసే వద్ద కనీసం ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను తీవ్ర గాయాలు పాలు చేస్తుంది.

ఇందుకు నిదర్శనం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనలే ఇందకు ఉదాహరణ. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన దొందడి కుమార్, అదే గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ లకు వాటర్ ఫ్రెషింగ్ వద్ద గాయాలయ్యాయి. అలాగే బైలర్ వద్ద బికాస్ మిస్ ఫైర్ కావడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో సదాశివనగర్ లో నివాసం ఉంటున్న శంకర్ తో పాటు అంబర్ సింగ్, దేవయ్య గాయల పాలయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించిగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఉంది. గతంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడు మరణిస్తే ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఫ్యాక్టరీ యాజమాన్యం తుంగలో తొక్కిందని కార్మికుల ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed