- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: దూకుడు పెంచిన ACB అధికారులు
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. నాంపల్లిలోని గగన్ విహార్(Gagan Vihar)లో మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. నాంపల్లిలోని గగన్ విహార్(Gagan Vihar)లో మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు దొరికారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. గగన్ విహార్లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Next Story






