యువతిని గొంతుకోసి చంపిన యువకుడు

by Dishafeatures2 |
యువతిని గొంతుకోసి చంపిన యువకుడు
X

దిశ, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వేలూరు రోడ్డులోని కొండమిట్ట ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న ప్రశాంతి అనే యువతి దారుణ హత్యకు గురైంది. చక్రవర్తి అనే యువకుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో వున్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక యువతి హత్య వెనుక ప్రేమ వ్యవహారం కారణమా లేక మరేదైన కారణం ఉందా అనే విషయాలు తెలయాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed