హత్యనా.. ఆత్మహత్య నా..?

by Disha Web Desk 20 |
హత్యనా.. ఆత్మహత్య నా..?
X

దిశ, దేవరకొండ : ప్రేమించిన వాడు కాదన్నాడా ? తల్లిదండ్రులు చూస్తున్న పెండ్లి సంబంధాలు ఇష్టం లేకనా ! నేనావత్ చిన్ని ఆత్మహత్య వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి ? ఆమె మరణం మిస్టరీగా మారిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరకొండ మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొర్ర తండాకు చెందిన నేనావత్ మాన్సింగ్ రెండవ భార్య రంగి కుమార్తె నేనావత్ చిన్ని (18) ఆత్మహత్య పై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. నేనావత్ చిన్ని గత రెండు సంవత్సరాల కిందట పదవతరగతి చదివి ఇంటి దగ్గరనే ఉంటున్నది, అదే గ్రామానికి చెందిన కొర్ర విజయ్ తో నాలుగు సంవత్సరాలుగా వారి ఇద్దరి మధ్యన ప్రేమవ్యవహారం నడుస్తున్నది. అప్పటికే విజయ్ కి పెండ్లి అయి ఇద్దరుపిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ విజయ్ పై చిన్ని ప్రేమ చంపుకోలేకపోయింది. తల్లిదండ్రులు ఇటీవల పెండ్లి సంబంధాలు చూస్తుండడంతో తల్లిదండ్రులు చూసే సంబంధాన్ని ఇష్టపడిన చిన్ని గత మూడు రోజుల కిందట 29 తారీకు సోమవారం గ్రామం నుండి వెళ్లిపోయినది అని తల్లిదండ్రులు తెలిపారు. ఇట్టి విషయమై చిన్ని తల్లిదండ్రులు విజయ్ విజయ్ ని బుధవారం నిలదీయగా, 29 నాడు సోమవారం తన దగ్గరికి వచ్చి తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, నన్ను పెళ్లి చేసుకోమని అడగగా ! దానికి బదులుగా విజయ్ నాకు ఇప్పటికే పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. మీ తల్లిదండ్రులు చూసే సంబంధాలు చేసుకోమని చిన్నికి నచ్చజెప్పి పంపించానని అన్నాడు.

అయినా విజయ్ పై ప్రేమ చంపుకోలేక చిన్ని అదే రాత్రి తన తండా దగ్గర్లో ఉన్నబావిలో దూకి చనిపోయి ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్ని బుధవారం గ్రామ సమీపంలోని బావిలో పడి మృతి చెందిందని గుర్తించిన తల్లిదండ్రులు చిన్ని మరణానికి విజయ్ కారణమని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి అయిన విజయ్ కి ఎట్టి పరిస్థితుల్లో నన్ను (చిన్ని) ని ఇచ్చి తమ తల్లిదండ్రులు పెండ్లి చేయరేమోనన్న అనుమానంతో చిన్నిఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా ! లేక విజయ్ చిన్నిమరణానికి కారణమై ఉంటాడా అన్న అనుమానాలను పలువురు వ్యక్తపరుస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని గ్రామానికి చెందిన విజయ తమ ప్రేమవ్యవహారం ఎక్కడ బయట పెడుతుందో అనే అనుమానంతో విజయ్ తమ కూతురిని కొట్టి చంపి బావిలో వేసి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తపరిచారు. తమ కుమార్తె మృతి పై న్యాయవిచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తండ్రి మాన్సింగ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కస్తూరి సతీష్ తెలిపారు.


Next Story

Most Viewed