- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Crime: బాలికను వంచించి.. ఆపై చెట్టుకు వేలాడదీసి..
దిశ, వెబ్డెస్క్: ప్రేమ పేరుతో బాలికను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా ఆమె గర్భం దాల్చిందని తెలియడంతో అమానుషంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని రాణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన మైనర్ బాలిక.. కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ అర్మాన్ అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అన్సారీ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న అన్సారీ బాలికను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
బాలిక స్వగ్రామానికి వెళ్లి ఒకసారి కలవాలంటూ ఊరి చివరికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను హత్య చేసి.. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న ఓ చెట్టుకు బాలిక మృతదేహాన్ని వేలాడదీశాడు. ఉదయం ఆ బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్స్లో బాలికది హత్యేనని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు వారికి అన్సారీపై అనుమానం ఉందని చెప్పగా.. అన్నారీని పోలీసులు తమదైనా స్టైల్లో విచారించగా నేరం అంగికరించాడు. అనంతరం పోలీసులు అన్సారీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
- Tags
- crime