కూకట్‌పల్లిలో యువకుడు దారుణ హత్య.. ఎంత కిరాతకంగా చంపారో తెలుసా?

by Disha Web Desk 2 |
కూకట్‌పల్లిలో యువకుడు దారుణ హత్య.. ఎంత కిరాతకంగా చంపారో తెలుసా?
X

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కైత్లాపూర్ మైదానంలో ఓ యువకుడి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉందని అందిన సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మృతదేహం పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉండగా పక్కనే హత్యకు వినియోగించిన కత్తి, బండరాళ్లు, చెక్క, బీర్ బాటిళ్లు లభించాయి. సంఘటనా స్థలాన్ని కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నరసింగరావు, డీఐ ఆంజనేయులు సందర్శించారు. మృతుడు బాలానగర్ గౌతం నగర్‌కు చెందిన ఎండి.గౌస్(28)గా పోలీసులు గుర్తించారు. గౌస్ బాలానగర్‌లోని ఓ పంచర్ దుకాణంలో పని చేస్తుంటాడని, అతడికి భార్య నూర్జహాన్ నలుగురు సంతానం ఉన్నట్టు పోలీసుల విచారణతో తేలింది. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పంచర్​షాప్ కోసమని ఇంటి నుంచి వెళ్లిన గౌస్​ఆదివారం కైత్లాపూర్​మైదానంలో శవమై కనిపించాడు. గౌస్​ తలకు బలమైన గాయలు, కత్తి పోట్లు ఉండటంతో పాటు, సంఘటనా స్థలంలో బీర్ బాటిళ్లు, కత్తి, బండరాళ్లు, చెక్క ముక్కలు ఉండటంతో నిందితులు గౌస్‌ను ఉద్దేశ్య పూర్వకంగానే కిరాతకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మద్యం సేవిస్తుండగా హత్య జరిగి ఉంటుందని, హత్యకు తోటి స్నేహితులు, లేదా తెలిసిన వారు ఎవరైనా ఉండొచ్చు అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed