పెళ్లికి నో చెప్పిందని లవర్ ను కాల్చి చంపిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

by Dishafeatures2 |
పెళ్లికి నో చెప్పిందని లవర్ ను కాల్చి చంపిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడ్డాడు ఓ యువకుడు. అనంతరం పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే ఆ యువతి నో చెప్పడంతో ఆమెను హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుక్నా గ్రామానికి చెందిన దీప్ మాలా (24) అనే యువతి బులంద్ షహర్ జిల్లా సాలెంపూర్ లోని తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తుండేది. ఈ క్రమంలోని గ్రామానికి చెందిన రాహుల్ చౌదరి (26) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరు ప్రేమించుకున్నారు. అయితే కొంత కాలం తర్వాత ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడా యువకుడు.

ఈ క్రమంలోనే గురువారం యువతి సొంత ఊరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ మళ్లీ వేధించాడు. అయితే ఆమె కాదనడంతో ఆవేశానికి గురైన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకితో ఆ యువతిని కాల్చేవేశాడు. అనంతరం భయంతో పాయిజన్ తాగాడు. అయితే తుపాకి శబ్దం రావడంతో చుట్టు పక్కలవాళ్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. ఇక కొనఊపిరితో కొట్టామిట్టాడుతున్న యువకుడిని నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ ఆ యువకుడు ఇవాళ చనిపోయినట్లు డీసీపీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed