- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్యను అనుమానించాడని యువకుడి హత్య
దిశ, తిరుపతి: స్థానిక హతిరాంజి కాలనీలో హనీ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న విజయ్ కుమార్ బుధవారం నాలుగు గంటల ప్రాంతంలో హోటల్ దగ్గర నుంచి భార్యాభర్తలు ఇంటికి వెళుతుండగా హోటల్ సమీపంలో మంగళం బీటీఆర్ కాలనీ చెందిన మనీ, భార్గవ్, ప్రవీణ్, కన్నయ్య అనే నలుగురు యువకులు రామచంద్రపురం దగ్గర మద్యం సేవించి అక్కడి నుంచి తిరిగి తిరుపతికి వచ్చారు. అన్నమయ్య సర్కిల్ సమీపంలో హోటల్ దగ్గర ఆటో నిలబెట్టి కిందకు దిగారు. హోటల్ మూసి వేసుకొని హోటల్ యజమాని విజయకుమార్ అతను భార్య వెళుతూ ఉండగా సమీపంలో ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఉండగా ఇద్దరు యువకులు బయట ఉన్నారు. ఈ క్రమంలోనే హోటల్ యజమానిపై ఆ యువకులు ఘర్షణకు దిగారు. దీంతో హోటల్ యజమాని యువకులపై ఘర్షణ పడుతూ సమీప ప్రాంతంలో ఉన్న హోటల్ దగ్గర ఉన్న వాళ్లకు సమాచారం అందించారు.
దీంతో హోటల్లో పనిచేస్తున్న వారంతా కలిసి ఆ యువకుల్ని అందర్నీ ఘర్షణ పడుతూ లోపలికి తీసుకెళ్లారు. ఇంతలో మంగళం బీటీఆర్ కాలనీ చెందిన చెందిన నారాయణ కుమారుడు మనీ (25)ని హోటల్ యజమాని విజయ్ కుమార్ కర్ర తీసుకొని తలపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన మనీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఈస్ట్ సిఐ బీవీ శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా తనను అనుమానించారనే కోపంతోనే మనీ తలపై కొట్టినట్లు నిందితుడు విజయ్ కుమార్ పోలీసుల విచారణలో తెలిపాడు.