రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై ప్రేమ్​ సాగర్​ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలం, మైలారం గ్రామానికి చెందిన పి. ఆంజనేయులు కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి హెచ్​ఎంటీ హిల్స్​ శ్రీరాంనగర్​ కాలనీలో నివాసం ఉంటుంది.

ఆంజనేయులు కుమారుడు పి. గణేష్​(17) ఆదివారం ఇంటి నుంచి ఫిల్టర్​ వాటర్​ తీసుకు రావడానికి హోండా యాక్టివా వాహనంపై వెళ్లి వస్తుండగా తులసివనం సమీపంలోని అపోలో ఫార్మసీ ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయం అవడంతో స్థానికులు గణేష్​ను రాందేవ్​ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గణేష్​ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు దృవీకరించారు. గణేష్​ సోదరుడు పి. వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రేమ్​ సాగర్​ తెలిపారు.

Next Story

Most Viewed