బైకు అదుపుతప్పి యువకుడు మృతి.. మరొకరికి గాయాలు

by Disha Web Desk 11 |
బైకు అదుపుతప్పి యువకుడు మృతి.. మరొకరికి గాయాలు
X

దిశ, మొయినాబాద్: బైకు అదుపుతప్పి యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయిన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం .. యూసఫ్ గూడ ఫాతిమా నగర్ కు చెందిన అబ్దుల్ సాజిద్ (23) సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అబ్దుల్ సాజిద్, అతని స్నేహితులైనటువంటి షఫీ, అఖిల్, షాకీర్, లియాకాత్ ఒస్మన్ లతో కలిసి రోజ్ లాండ్ ఫామ్ కు వెళ్లారు. రాత్రి అక్కడే అందరూ కలిసి ఉన్నారు.

మంగళవారం ఉదయం తిరిగి హైదరబాద్ వస్తుండగా బైక్ పై ఉన్న సాజిద్, షపీ ఇద్దరూ మార్గమధ్యంలో రాణి ఇంజన్ వాల్స్ లిమిటెడ్ కంపెనీ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. వెనక నుంచి కారులో వస్తున్న వారి స్నేహితులు గమనించి వారిని లాలానగర్ దగ్గరలో ఉన్న ఆలియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి రక్త గాయాల అయిన అబ్దుల్ సాజిద్ చనిపోయాడని తెలిపారు. ఇట్టి విషయంపై మృతుడు అన్న అబ్దుల్ సమీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Next Story