రైలు నుంచి పడి యువకుడి మృతి

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్లే హంద్రీ ఎక్సుప్రెస్ నుండి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు మహబూబ్ నగర్ రైల్వే ఎస్సై కె. రాజు

రైలు నుంచి పడి యువకుడి మృతి
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్లే హంద్రీ ఎక్సుప్రెస్ నుండి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు మహబూబ్ నగర్ రైల్వే ఎస్సై కె. రాజు తెలిపారు. దివిటిపల్లి బ్రిడ్జి రైల్వే లైన్ సమీపంలో ఈ మృతదేహం కనిపించిందని, మృతుని వయసు సుమారు 25 ఏళ్లు ఉండవచ్చునని ఆయన తెలిపారు. రన్నింగ్ ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు క్రిందపడి చనిపోయి ఉంటాడని, ఎవరైనా ఈ మృత దేహాన్ని గుర్తిస్తే సెల్ నెంబర్ 8712658597 సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు.

Next Story