ఒక్క ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్.. ఏపీలో మత్తు కోసం టవర్ ఎక్కి యువకుడు హల్ చల్

by Ajay Maddhiboyina |

మార్కాపురం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెంలో మ‌ద్యం మ‌త్తులో ఉడుత‌ల హ‌నుమంతు అనే యువ‌కుడు సెల్ ట‌వ‌ర్ ఎక్కి హ‌ల్ చ‌ల్ చేశాడు.

ఒక్క ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్.. ఏపీలో మత్తు కోసం టవర్ ఎక్కి యువకుడు హల్ చల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య చాలా మంది మ‌త్తుకు అల‌వాటుప‌డి జీవితాల‌ను చిత్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మద్యానికి మాత్రమే బానిసైన యువత ఇప్పుడు గం*యికి అల‌వాటు ప‌డి జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను దీని వాడ‌కం పెరిగిపోతోంది. ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నా చాప‌కింద నీరులా గం*యి గ్రామాలు, ప‌ల్లెల‌కు విస్త‌రిస్తోంది. తాజాగా ఏపీలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నంగా మారింది. మార్కాపురం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెంలో మ‌ద్యం మ‌త్తులో ఉడుత‌ల హ‌నుమంతు అనే యువ‌కుడు సెల్ ట‌వ‌ర్ ఎక్కి హ‌ల్ చ‌ల్ చేశాడు. గ్రామంలో పోలీస్ స్టేషన్ ప‌క్క‌నే ఉన్న బీఎస్ఎన్ఎల్ ట‌వ‌ర్ ఎక్కిన యువ‌కుడు త‌న‌కు గం*యి ప్యాకెట్ కావాల‌ని డిమాండ్ చేశాడు.

లేదంటే కింద‌కు దూకేస్తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. మ‌త్తులో తూలుతూ ఉన్న యువ‌కుడు ఎక్క‌డ కింద‌ప‌డ‌తాడో అని అంతా ఆందోళ‌న చెందారు. ఈ క్ర‌మంలో ఎస్సై దేవ‌కుమార్ చాక‌చ‌క్యంగా ఆ యువ‌కుడిని మాట‌ల్లో పెట్టి కింద‌కు దించాడు. ఎందుకు ట‌వ‌ర్ పైకి ఎక్కావ‌ని ప్ర‌శ్నించగా నాకు ఒక ప్యాకెట్ ఇప్ప‌టించండి సార్ ప్లీజ్ అంటూ పోల‌సుల‌నే బ‌తిమాలాడు. దీంతో ఆ యువ‌కుడిని తీసుకువెళ్లి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించారు. ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో గం*యి విక్ర‌యిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంద‌ని గ్రామ‌స్థులు అంటున్నారు. ఇప్ప‌టికైనా పోలీసులు అది ఎక్క‌డ నుండి వ‌స్తుందో ఎలా వ‌స్తుందో తెలుసుకుని పూర్తిగా నిర్మూలించాల‌ని కోరుతున్నారు.

Next Story