చికిత్స పొందుతూ గుండెపోటుకు గురైన మహిళ మృతి..

by Disha Web Desk 20 |
చికిత్స పొందుతూ గుండెపోటుకు గురైన మహిళ మృతి..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కాగా సలేశ్వరం ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుని గురువారం సాయంత్రానికి మృతుల సంఖ్య ఇద్దరికి చేరింది. నాగర్ కర్నూల్ కి చెందిన వ్యక్తి జాతరలో ఊపిరాయడ మృతిచెందాడు.

కాగా ముంబాయి ప్రాంతానికి చెందిన విజయ అనే గృహిణి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి సలేశ్వరం దైవదర్శనానికి వెళ్లగా సలేశ్వర సమీపానికి వెళ్లేసరికి మహిళకు గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆమెను ప్రత్యేక జీపులో అచ్చంపేట ఆస్పత్రికి చేర్చి వైద్య సేవలు తరలించారు. కాగా ఆ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.



Next Story

Most Viewed