పరామర్శించడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..

by Disha Web Desk 20 |
పరామర్శించడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
X

దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన భూమన్న బేల మండలంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య శైలజ తో కలిసి మోటార్ బైక్ పై వెళ్లి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో బంధువులను పరామర్శించారు.

తిరిగి వస్తున్న క్రమంలో ఇచ్చోడ మండలంలోని గాంధీ నగర్ సమీపంలో జాతీయ రహదారి పై వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న వాహనం ఆమెపై నుండి వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు అయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, వాహనం ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story