రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

by Dishafeatures2 |
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
X

దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో చింతల వీధి గాటి వద్ద ఎదురెదురుగా వస్తున్న బొలెరో, జీప్ ఢీకొని జీప్ బోల్తా పడిన ప్రమాదంలో జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి కి తరలించి గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed