Crime News: ఏడేళ్ల బాలికను పాఠశాలలో 18 గంటలు బంధించిన సిబ్బంది

by Disha Web Desk 16 |
Crime News: ఏడేళ్ల బాలికను పాఠశాలలో 18 గంటలు బంధించిన సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. మరో ఘటన చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. సాధారనంగా సాయంత్రం స్కూల్ క్లోజ్ చేసేటప్పుడు క్లాస్‌రూమ్‌ను చెక్‌చేసి తలుపులు వేస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు క్లాస్‌రూమ్‌లోనే ఉన్నారేమో అన్న అనుమానంతో తనిఖీ చేసి క్లోజ్ చేస్తుంటారు.

కానీ, సంభాల్ పాఠశాలలో క్లాస్ రూమ్ చెక్ చేయకుండానే 1వ తరగతి బాలికను గదిలో ఉంచి తాళం వేశారు. దాదాపు 18 గంటల పాటు బాలిక ఒక్కతి గదిలోనే ఉండిపోయింది. అదే రోజు సాయంత్రం మంగళవారం పాఠశాల ముగిసిన బాలిక ఇంటికి రాకపోవడంతో వాళ్ళ నానమ్మ పాఠశాలకు చేరుకుంది. అక్కడ పిల్లలు లేరని సిబ్బంది చెప్పారని ఆమె బాబాయ్ తెలిపారు. ఇక్కడ పిల్లలు ఎవరూ లేరని చెప్పటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అటవీ ప్రాంతంలో వెతికినా ఎక్కడా కనిపించలేదు.

బుధవారం ఉదయం 8 గంటలకు పాఠశాల తెరిచి చూడగా బాలిక రాత్రంతా పాఠశాల గదిలో బంధించి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాల వేళలు ముగిసినా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది గదులను పరిశీలించ లేదని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సింగ్ తెలిపారు. ఇది నిర్లక్ష్యానికి కారణమని, మొత్తం సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

Crime News: రూమ్‌లో నగ్నంగా అక్కాతమ్ముడు.. తల్లి సడెన్ ఎంట్రీతో..



Next Story