మహా శివరాత్రి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

by Dishafeatures2 |
మహా శివరాత్రి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
X

దిశ, అలంపూర్/ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామ సమీపంలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సాయి, రఫీ, శేఖర్ మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెనిదిన వారిగా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకలను చూసుకొని శనివారం మధ్య రాత్రి ఒంటి గంట సమీపంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






Next Story

Most Viewed