రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 10 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-13 01:58:18  IST  )

రోడ్డు ప్రమాదంలో ఏకంగా 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 10 మంది దుర్మరణం
X

దిశ, వె‌బ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. దౌసా-మనోహర్‌పూర్‌ జాతీయ రహదారిపై బాపీ ప్రాంతంలో ప్యాసింజర్ వ్యాన్‌ను ఓ భారీ కంటైనర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యాన్‌‌లో ఉన్న 10 మంది తీవ్ర గాయాలతో మృతి చెందారు. అయితే, ఖాటు శ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సాగర్ రానా, కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని, 8 మంది తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి, మరో ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

Next Story