అనకాపల్లి జిల్లాలో వరుస హత్యల కలకలం

by Dishafeatures2 |
అనకాపల్లి జిల్లాలో వరుస హత్యల కలకలం
X

దిశ, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఒకే రోజు రెండు హత్యలు జరగడం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. యలమంచిలి పరిధిలో ఇటీవల 4 హత్యలు.. తాజాగా మునగపాక మండలం గనపర్తి చుచు కొండ గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. బావ బావమరిదిల మధ్య తగాదాలు మానవ సంబంధాలు ప్రశ్నార్థంగా మారే రీతిలో హత్యలకు దారితీసాయి. మేనమామే కాల యముడిగా మారి హత్యకు పాల్పడ్డాడు. తల, మొండెం వేరు చేసి హత్య చేసిన ఘటన స్థానికల్లో విస్మయానికి గురి చేసింది.

మొండెం, తల వేరు చేసి గోనె సంచీలో దాచి ఉంచాడు. వి.ఎల్ పురం ఘటనలో యువకుడి కాళ్లు, చేతులు కట్టి నూతిలో పడేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనకాపల్లి జిల్లాలో వరస హత్యలతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. డీజీపీ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed