కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏటీఎంలో చోరీ

by Dishafeatures2 |
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏటీఎంలో చోరీ
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త సాయిబాబా గుడి రోడ్డులో గల యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎం మిషన్ చెడిపోవడంతో ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఏటీఎం మిషన్ బాగు చేసే కంపెనీలో పని చేస్తానని బ్యాంకు సిబ్బందితో చెప్పాడు. దీంతో సదరు బ్యాంకు వారు ఆ వ్యక్తిని పిలిపించి ఏటీఎం మిషన్ రిపేర్ చేయమని కోరారు. దీంతో అతను ఏటీఎం మిషన్ రిపేర్ చేసి అందులో నుంచి 50 వేల రూపాయల నగదుతో ఉడాయించాడు. ఏటీఎం మెషిన్ లో అమౌంట్ తక్కువ రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకుకు సీసీఎస్ పోలీసులు చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed