ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి..
X

దిశ, సోన్ : సొన్ బ్రిడ్జ్ పై ద్విచక్రవాహనం అజాగ్రత్తగా నడుపుతూ పడడంతో శేకర్ మృతి చెందినట్లు సొన్ ఎస్సై ఎస్.రవీందర్ తెలిపారు. మృతుడు గోపుశేఖర్ (47) కళ్ళేడి గ్రామం, ఆలూరు మండలానికి చెందిన వారు. కాగా మృతుడు తన మోటార్ సైకిల్ పై మాదాపూర్ గ్రామానికి తన భూమిని చూడటానికి వచ్చి, తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వెలుతున్నారు.

ఈ క్రమంలోనే సొన్ గోదావరి బ్రిడ్జివద్దకు రాగానే, అజాగ్రత్తగా మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ రోడ్ మీద పడిపోవడంతో తలకు బలమైన గాయం ఇతర భాగాలలో గాయాలయ్యి చనిపోయారని తెలిపారు. కుటుంబసభ్యులు ఇచ్చిన దరఖాస్తు మేర సొన్ ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.



Next Story

Most Viewed