గోదావరి స్నానానికి వెళ్లి..తిరిగి రాని లోకాలకు..

by Disha Web Desk 20 |
గోదావరి స్నానానికి వెళ్లి..తిరిగి రాని లోకాలకు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద గల పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చిన వ్యక్తి భార్య ముందే నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. పూర్తివివరాల ప్రకారం గంగా స్నానానికి వచ్చిన ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కి చెందిన చిలుక లావణ్య, ఆమె భర్త చిలుక మధు (48) వీఐపీ పుష్కర ఘాట్ పోచంపాడు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు.

స్నానంచేసే సమయంలో గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల్ల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రింద గల గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని గల్లంతైన చిలుక మధుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మెండోరా ఎస్సై జీ.శ్రీనివాస్ కోరారు.

Next Story

Most Viewed