ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బలవన్మరణం

by Disha Web Desk 1 |
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బలవన్మరణం
X

దిశ చేగుంట : కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు తాళతేక, మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెట్ల తిమ్మయ్యపల్లి పరిధిలోని పులిగుట్టతండాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం ప్రకారం.. పులిగుట్టతండాకు చెందిన కరంటోతు సీతారాం (40) వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో మద్యానికి సీతారం ప్రతిరోజూ కుటుంబం, తన ఆర్థిక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ బాధపడే వాడు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి సీతారాం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన భార్య రేణుక చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడు సీతారాంకు భార్య రేణుక, కూతుళ్లు ప్రియాంక, శైలజ, కొడుకు రాజేష్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.


Next Story