- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి..
దిశ, మిడ్జిల్: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ వద్ద సోమవారం ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలం శంకరయ్య పల్లికి చెందిన అంగోతు రాములు (౩౩) కల్వకుర్తిలోని ఉమెన్స్ రైట్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తుండే వాడు.
సోమవారం అతని స్నేహితుడైన మిడ్జిల్ మండలం వస్ఫుల్ గ్రామానికి చెందిన బాలయ్యతో కలిసి కల్వకుర్తి నుంచి ద్విచక్ర వాహనంపై జడ్చర్ల వైపు వస్తుండగా మండల పరిధిలోని మున్ననూర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో రాములు, బాలయ్య లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం రాములు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మిడ్జిల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.