అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, అల్లాదుర్గం : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన రామోజీ పల్లి ఆగమయ్య (36) శనివారం సాయంత్రం ఇంటి నుంచి పనుల నిమిత్తం బయలుదేరి వెళ్లాడు. ముప్పారం నుంచి బొడ్మట్ పల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న కల్వర్ట్ వద్ద ఆగమయ్య అచేతనంగా పడి ఉండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

అల్లాదుర్గం సీఐ జార్జ్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆగమయ్యా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జార్జ్ తెలిపారు.

Next Story