- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దిశ, అల్లాదుర్గం : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన రామోజీ పల్లి ఆగమయ్య (36) శనివారం సాయంత్రం ఇంటి నుంచి పనుల నిమిత్తం బయలుదేరి వెళ్లాడు. ముప్పారం నుంచి బొడ్మట్ పల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న కల్వర్ట్ వద్ద ఆగమయ్య అచేతనంగా పడి ఉండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.
అల్లాదుర్గం సీఐ జార్జ్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆగమయ్యా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జార్జ్ తెలిపారు.