ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి..
X

దిశ, చేవెళ్ల : మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రంలోని బేధాగార్జీ గ్రామానికి చెందిన జె. లక్ష్మి పుత్ర (34) గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వేస్తూ పెయింట్ బకెట్ తన సహాపనివారికి అందిస్తుండగా ప్రమాదవశాత్తు సీసీ రోడ్డుపై పడ్డాడు. హుటాహుటిన భాస్కర్ హాస్పటల్ కి తరలించగా తలకు తగిలిన గాయం వల్ల అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న ఎస్సై అబ్దుల్ హయ్యుమ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story