- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో పడి వ్యక్తి మృతి..
దిశ, పెద్దవూర : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామశివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన షేక్ లాల్ సాహెబ్ తండ్రీ మౌలాసాహెబ్ (50)కొద్ది రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి పెద్దవూరకు వచ్చాడు. పెద్దవూర గ్రామం శివారులో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ పట్టాలు (ధాన్యం తడవకుండా వేసే కవర్)లు కిరాయికు ఇచ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
బుధవారం సాయంత్రం తన యూనికార్న్ మోటార్ సైకిల్ పై నిడమానూరు మండలంలోని పార్వతీపురంకు వెళ్లి, అక్కడ పని చూసుకొని, ఒక ఇనుప మంచంను తన బండి పై తీసుకొని పెద్దవూర కు వస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి పూట కొత్తగూడెం గ్రామ శివారులోకి రాగానే ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన గల కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మౌలానా సాహెబ్ మృతిచెందారు. మృతుడికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం ఉన్నారు. మృతుడి భార్య ద్రాక్షబి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పెద్దవూర ఎస్సై పరమేష్ తెలిపారు.