రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, జుక్కల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జుక్కల్ మండల పరిధిలోని నరేంద్ర మహారాజ్ మందిరం వద్ద సోమంరాం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీదర్ జిల్లా ఔరాద్ మండల కేంద్రానికి చెందిన బాబురావు బైక్ పై జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరిన బాబురావు జుక్కల్ మండల పరిధిలోని నరేంద్ర మహారాజ్ మందిరం దగ్గర రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతో పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాబురావు అక్కడికక్కడే మృతి చెందాడు. బాబురావు కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జుక్కల్ ఎస్సై మురళి తెలిపారు.

Next Story

Most Viewed