రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, పరిగి : ఎదురెదుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన హరీష్ (30) వికారాబాద్ వైపు నుంచి పరిగికి మోటార్ సైకిల్ పై సోమవారం రాత్రి ప్రయాణిస్తున్నాడు. పరిగి మండలం నస్కల్ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ హరీష్ బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిష్ తలపగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నగరంలోని ఉస్మానియా తరలించారు. కగా హరీష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య నందిని ఉంది. నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై విటల్ రెడ్డి తెలిపారు.

Next Story