పిడుగుపాటుకు వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
పిడుగుపాటుకు వ్యక్తి మృతి..
X

దిశ, భూత్పూర్: మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామం వద్ద గురువారం పిడుగుపాటుతో అడ్డాకుల మండలం వర్ని గ్రామానికి చెందిన అశోక్ సాగర్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. తన సొంత గ్రామం నుంచి తన మామతో కలిసి మోటార్ సైకిల్ పై హైదరాబాద్ బయలుదేరారు. అన్న సాగర్ గ్రామం దాటిన తర్వాత వర్షం కురవడంతో రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో పాటు అశోక్ సాగర్ కు అత్యంత సమీపంలో పిడుగు పడింది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. అతని మామ కొంత దూరం ఉండడంతో అతనికి ప్రమాదం తప్పింది.


Next Story

Most Viewed