నీట మునిగిన వ్యక్తి శవమై తెలాడు ...

by Disha Web Desk 20 |
నీట మునిగిన వ్యక్తి శవమై తెలాడు ...
X

దిశ, రాజంపేట : మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండాలో చెరువులో పడి చనిపోవడానికి ప్రయత్నించిన జింకనర్సింలును కాపాడపోయి ధరావత్ సంగ్య (50) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి శనివారం గల్లంతయ్యాడు. ఆదివారం రెవెన్యూ అధికారులు పోలీస్ సమక్షంలో చెరువులో వెతికించగా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గల్లంతయిన వ్యక్తి శవమై తెలాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య బూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజు తెలిపారు.



Next Story

Most Viewed