కారు ఢీ.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ, కమ్మర్ పల్లి : కారు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ గ్రామంలో చోటు చేసుకుంది.

కారు ఢీ.. వ్య‌క్తి మృతి
X

దిశ, కమ్మర్ పల్లి : కారు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ గ్రామానికి చెందిన గంగాధ‌ర్ గురువారం రాత్రి రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న స‌మ‌యంలో షిఫ్ట్ డిజైర్ కారు (TS 02EP0504) వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో గంగాధర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అది గమనించిన స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా 108 సిబ్బంది గంగాధర్ ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కారు నడిపిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు.

Next Story