- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, చిలుకూరు : మండలంలో ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సీత్లా తండాకు చెందిన బాదావత్ బాలాజీ నాయక్ (45) బుధవారం తన ఇంటిపైన సామాను సర్దుతున్నాడు. ఈ సమయంలో అతని కాలుకు ఇనుప తీగ తట్టడంతో డాబా అంచున ఉన్న ఆయన బ్యాలెన్స్ తప్పి పై నుంచి కిందపడిపోయాడు.
తలకు బలమైన గాయాలైన అతనిని వెంటనే కోదాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని అక్కడి వైద్యులు ధృవీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
Next Story