ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..
X

దిశ, చిలుకూరు : మండలంలో ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది‌. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సీత్లా తండాకు చెందిన బాదావత్ బాలాజీ నాయక్ (45) బుధవారం తన ఇంటిపైన సామాను సర్దుతున్నాడు. ఈ సమయంలో అతని కాలుకు ఇనుప తీగ తట్టడంతో డాబా అంచున ఉన్న ఆయన బ్యాలెన్స్ తప్పి పై నుంచి కిందపడిపోయాడు.

తలకు బలమైన గాయాలైన అతనిని వెంటనే కోదాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని అక్కడి వైద్యులు ధృవీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed