ఈ నవ దంపతులది ఎంత దురదృష్టమో.. నెల కూడా కలిసి ఉండలేకపోయే

by Disha Web Desk 7 |
ఈ నవ దంపతులది ఎంత దురదృష్టమో.. నెల కూడా కలిసి ఉండలేకపోయే
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దలు ఎన్నో ఆశలతో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. నిండునూరేళ్లు పిల్లాపాపలతో కలిసి ఉండాలని దీవిస్తారు. కొత్త దంపతులు కూడా అంతే.. తమ జీవితాల కోసం ఎన్నో కలలు కంటారు. మరెన్నో ఆలోచనలు చేస్తారు. ఇదే విధంగా కోరుకుంది ఓ కుటుంభం. కానీ.. తమ ఆశలు ఆవిరైపోయాయి. కాళ్ల పారని ఆరక ముందే నవ వధువు మరణించింది. ఆమె మరణం కుటుంబంలో విషాదం నింపింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కుశాల వద్ద జరిగింది. అసలు ఏం జరిగిందంటే..

సిగె హోసూరుకు చెందిన గణేశ్‌కు శోభ అనే కుమార్తె ఉంది. తన కూతురికి నెల రోజుల క్రితమే అరకలగూడు తాలుకాలోని ఇబ్బడి గ్రామానికి చెందిన నవీన్‌తో అంగరంగా వైభవంగా వివాహం జరిపించాడు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన నవ జంట ఎన్నో కలలు కన్నారు. కానీ.. వారి కలలను నిజం చేసుకునే అవకాశం వారికి లేకుండా పోయింది. సోమవారం నూతన దంపతులిద్దరూ కలిసి అరకలగూడు నుంచి హొళె నరసిపురకు బైక్ మీద వెళ్తున్నారు. ఇంతలో వీరిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. అతివేగంగా వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపట్టా శోభ సంఘటన స్థలంలోనే మరణించింది. వరుడు నవీన్ రెండు కాళ్లు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన నెలరోజులకే నవ వధువు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed