మటన్ వ్యాపారి అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు..

by Disha Web Desk 20 |
మటన్ వ్యాపారి అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు..
X

దిశ, మాచరెడ్డి : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వెరసి ఓ మటన్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండా గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే దయ్యాల శ్రీనివాస్(35) అనే మటన్ వ్యాపారి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మాచారెడ్డి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

గత కొంతకాలంగా మటన్ వ్యాపారం సరిగ్గా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. అప్పుల భారం పెరగడంతో, అప్పులు తీర్చే దారిలేక, కుటుంబ పోషణ భారమై కుటుంబంలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మృతుని తల్లి ఐలవ్వ ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఆయన వివరించారు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.



Next Story

Most Viewed