ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై వివాహిత హత్యాయత్నం

by Disha Web Desk 7 |
ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై వివాహిత హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కలిసి ఉన్నంత సేపు హ్యాపీగా అక్రమ సంబంధాన్ని ఎంజాయ్ చేస్తూ.. విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మృగాళ్లుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వచ్చే గొడవలు ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తన స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చివరికి అతడి మీదే వేడిగా ఉన్న నూనెతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఈరోడ్‌లోని భవాని ప్రాంతానికి చెందిన మీనా దేవి, కార్తీక్ డిగ్రీ నుంచి మంచి స్నేహితులు. అయితే మీనా దేవికి మూడేళ్ల క్రితం కార్తీక్ బంధువుతో వివాహం జరిగింది. పెళ్లైనా సరే వీరిద్దరు స్నేహంగా ఉండేవారు. కొన్నాళ్లకు వీరి మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరు సంతోషంగా అక్రమ సంబంధంతో హ్యాపీగా ఉండేవారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలైంది. కార్తీక్‌కు వేరే యువతితో వివాహం ఫిక్స్ అయింది. అయితే నన్ను మోసం చేస్తావా.. మన బంధాన్ని విడిచిపెడతావా అంటూ కార్తీక్‌పై సీరియస్ అయింది మీనా దేవి. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని కార్తీక్‌ను బతిమాలాండింది.

దీనికి ఒప్పుకోని కార్తీక్ వేరే యువతినే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పేశాడు. మూడేళ్ల బంధానికి కార్తీక్ ద్రోహం చేయడం మీనా తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు కార్తీక్ సిద్ధపడటం జీర్ణించుకోలేక పోయింది. దీంతో అతడిని ఏదో ఒకటి చేసి.. కార్తీక్‌పై పగ తీర్చుకోవాలి అనుకుంది. అనుకున్నట్లుగానే తాజాగా కార్తీక్‌ను మాట్లాడేందుకు పిలిచింది. ఈ క్రమంలోనే అతడిపై బాగా మరుగుతున్న నూనెను పోసింది. దీంతో కింద పడిపోయిన కార్తీక్ గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో దీనిపై కేసు నమోదు చేసుకుని మీనా దేవిని అదుపులోకి తీసుకుని.. దర్యాప్తు మొదలు పెట్టారు.



Next Story

Most Viewed