ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

by I. Sairam |   (  Updated:2026-01-30 14:44:03  IST  )

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, రాజేంద్రనగర్: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై పైడినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ దుర్గాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల వంశీయాదవ్‌(37), శ్రావ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వంశీయాదవ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story