యువతిని అలా చూసిందే కాక వాళ్ల బాబాయినీ హత్య చేసిండు

by Dishafeatures2 |
యువతిని అలా చూసిందే కాక వాళ్ల బాబాయినీ హత్య చేసిండు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తన అన్న కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకున్ని నిలదీసిన పాపానికి హత్యకు గురయ్యాడు ఓ వ్యక్తి. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేపట్టిన బాలాపూర్​పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్టు చేశారు. మహేశ్వరం జోన్​డీసీపీ సీహెచ్ శ్రీనివాస్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రం బస్తర్​ జిల్లా మదులపాలు గ్రామానికి చెందిన కే.కశ్యప్​(30) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్​ వచ్చి బాలాపూర్​ మండలం సుల్తాన్​పూర్​ గ్రామంలో స్థిరపడ్డాడు. కూలీగా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.

ఇదిలా ఉండగా నాలుగు నెలల క్రితం అతని అన్న కూతుళ్లు ఊర్మిళ కశ్యప్, భువనేశ్వరి కశ్యప్​లు తమ గ్రామానికే చెందిన మరికొందరితో కలిసి సుల్తాన్​పూర్​లోని రాజ్​గురు ప్లైవుడ్ ​డోర్స్​యూనిట్​లో పని చేయటానికి ఇక్కడకు వచ్చారు. బాబాయ్​ కశ్యప్​ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఇంటి పక్కనే నివాసముంటున్న సోనూ నంది ఎలియాస్​బంటి (27) కొన్నిరోజులుగా ఊర్మిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 4న రాత్రి 11.30 గంటల సమయంలో ఊర్మిళ గదిలో దుస్తులు మార్చుకుంటుండగా కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఊర్మిళ బాబాయ్​ కశ్యప్​ఇంటికి రాగానే జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో కశ్యప్ ​పక్కనే ఉంటున్న సోనూ నంది గదికి వెళ్లి అతన్ని నిలదీశాడు.

దాంతో రెచ్చిపోయిన సోనూ నంది తన వద్ద ఉన్న కత్తితో కశ్యప్​పై దాడి చేసి ఛాతీపై పొడిచాడు. అడ్డుకోవటానికి ఊర్మిళ ప్రయత్నించగా ఆమె చేతిపై పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఊర్మిళ వెంటనే బాబాయ్​ను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కత్తిపోటు గుండెల్లో దిగటంతో అప్పటికే మరణించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఊర్మిళ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన బాలాపూర్​బీ.భాస్కర్​కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుని కోసం ముమ్మరంగా గాలింపు జరిపి మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒప్పో మొబైల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.


Next Story