వేడి నీళ్ల బకెట్లో ముంచి బాలుడి హత్య

by Dishafeatures2 |
వేడి నీళ్ల బకెట్లో ముంచి బాలుడి హత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఓ గొడవ వల్ల తన కుమారుడితో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది ఓ వివాహిత. ఈ క్రమంలోనే ఆమెకు వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే ఆ ప్రియుడే ఆ వివాహిత కుమారుడిని వేడి నీళ్ల బకెట్ లో ముంచి చంపిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖేడ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ శరద్ కొలేకర్ అనే వ్యక్తి ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే కుమారుడితో ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ ఇంటికి తరచుగా వస్తుండేవాడు. ఈ నేపథ్యంలనే ఏప్రిల్ 6న సదరు మహిళ ఇంటికి విక్రమ్ వచ్చాడు. తాను వచ్చే వరకు తన కుమారుడిని చూసుకోవాలని చెప్పి ఆ మహిళ బయటకు వెళ్లింది.

అయితే ఆమె బయటకు వెళ్లిన కొంత సమయం తర్వాత తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన విక్రమ్.. ఆ బాలుడిని వేడి నీళ్ల బకెట్లో ముంచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ఇంటి లోపలికి రావడాన్ని గమనించిన ప్రమాదంగా చిత్రీకరించాడు. వెంటనే బాలుడిని ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. చికిత్స్ పొందుతూ ఇవాళ మృతి చెందాడు. విక్రమ్ మీద అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందా బాలుడి తల్లి. ఈ క్రమంలోనే విక్రమ్ ను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Next Story