ముగ్గురు కొడుకులను వరుసగా నిలబెట్టి రివాల్వర్తో కాల్చి చంపిన తండ్రి

by Dishafeatures2 |
ముగ్గురు కొడుకులను వరుసగా నిలబెట్టి రివాల్వర్తో కాల్చి చంపిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: కన్న ప్రేమను మరిచాడో కసాయి తండ్రి. అభం శుభం తెలియని తన సొంత కుమారులను వరుసగా నిలబెట్టి రివాల్వర్ తో కాల్చి చంపిన ఘటన అమెరికాలోని ఒహియోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాడ్ డోర్‌మాన్ (32) అనే వ్యక్తి మూడు, నాలుగు, ఏడు సంవత్సరాల వయసున్న తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రివాల్వర్ తో కాల్చి చంపాడు. తన ఇంట్లోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లలను భర్త నుంచి కాపాడటానికి ప్రయత్నించిన భార్యను కూడా నిందితుడు రివాల్వర్ తో కాల్చాడు. ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఇక తన కొడుకులను చంపుతున్న సమయంలో అతడి కూతురు వీధిలోకి వచ్చి తమ తండ్రి తమ తమ్ముళ్లను చంపుతున్నాడంటూ అరవడం మొదలుపెట్టింది. దీంతో అటుగా వెళ్తున్న కొందరు ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దారుణాన్ని చూసి షాక్ తిన్నారు. వాళ్లు వచ్చేసరికి నిందితుడు హాయిగా ఇంటి ముందు కూర్చొని ఉన్నాడని, పిల్లలు ముగ్గురు చినిపోగా.. భార్య కొనఊపిరితో ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed