రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, పరిగి : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాతికింది రాజు(35) వృత్తిరీత్యా జేసీబీ డ్రైవర్. ఆదివారం రాత్రి మోటార్ సైకిల్ పై పరిగి నుంచి స్వగ్రామమైన బసిరెడ్డిపల్లికి బయలుదేరాడు. పరిగి మండలం రంగాపూర్ గేటు వద్ద హైవే 163 రోడ్డు పై బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ పై కిందపడ్డాడు.

రాజు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పరిశీలించగా రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజుకు భార్య మల్లేశ్వరి, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మరి కాసేపట్లో ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యా పిల్లలకు రాజు మరణించాడు అని తెలియగానే బోరున విలపించారు.

Next Story