లారీ ఢీ కొని వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
లారీ ఢీ కొని వ్యక్తి మృతి..
X

దిశ, గరిడేపల్లి : లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై పి.వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన దాసోజు అంజయ్య చారి (53) కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కార్పెంటర్ పని నిమిత్తమై నేరేడుచర్ల వెళ్లగా ఆదివారం హనుమాన్ జయంతి కావడంతో పనిలేదని షాప్ యజమాని చెప్పారు. దీంతో అతను తిరుగు ప్రయాణమై ఆర్టీసీ బస్సు ఎక్కి గరిడేపల్లి చేరుకొని వేంకటేశ్వర హోటల్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్నారు.

ఈ క్రమంలో నాగర్ కర్నూలు నుంచి కోదాడకు తవుడు లోడ్ తో వస్తున్న లారీ డ్రైవర్ తన లారీని అతివేగంతో నడిపి అంజయ్య చారిని ఢీ కొట్టాడని తెలిపారు. దీంతో అంజయ్య చారి క్రింద పడగా లారీ అతని కాళ్ళ మీద నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఇది గమనించిన పోలీసులు అంబులెన్స్ లో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని అన్న వెంకటాచారి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed