రోడ్డుపై ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ దుర్మరణం

by Dishafeatures2 |
రోడ్డుపై ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాసనగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నుండి కర్నూలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు శ్రీనివాస్‌ నగర్‌ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. అయితేడ్రైవర్‌ భైరవమూర్తి రాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరోవైపు క్షతగాత్రులను మార్కాపురం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed