- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదంలో బాధితులు... కక్కుర్తిలో జనాలు..
by Batti.Sumithra |
ఇళ్ళు కాలి ఒకరు ఏడుస్తుంటే మంట ఖర్చుకుంటాం అని అన్నట్టుంది శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన.

X
దిశ, తూప్రాన్ : ఇళ్ళు కాలి ఒకరు ఏడుస్తుంటే మంట ఖర్చుకుంటాం అని అన్నట్టుంది శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన. ఈ సంఘటనకు సంబందించి వివరలలోకి వెళ్తే నాగపూర్ నుండి మేక తలకాయల లోడ్ తో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ తూప్రాన్ పరిధిలోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న సరకు రోడ్డుపై పడగా అదే అదునుగా భావించిన ప్రజలు పోటీపడి మరి తలకాయలను ఎత్తుకెళ్లారు. ఒక పక్క ప్రమాదం జరిగితే పట్టించుకోకుండా తమ చేతి వాటాన్ని ప్రదర్శించడం పట్ల మానవత్వం ఎటుపోతుందో అని అనుమానం కలుగుతుంది.
Next Story






