రాష్ట్రంలో తీవ్ర విషాదం.. జిల్లా సింగిల్ విండో మాజీ చైర్మన్ బలవన్మరణం

by Kema Shiva Kumar |

నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్లలో దారుణం చోటుచేసుకుంది. సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. జిల్లా సింగిల్ విండో మాజీ చైర్మన్ బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనపట్లలోని తన సొంత స్టోన్ క్రషింగ్ మిషన్ కార్యాలయంలో ఆయన ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. స్థానికులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆయన, తన కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Next Story