బ్రేకింగ్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. క్వార్టర్స్‌లో ఉన్న చెత్తకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వార్టర్స్‌ నుండి ఒక్కసారి భారీగా మంటలు ఎగసిపడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, క్వార్టర్స్‌‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed