ట్రాక్టర్ బైకు ఢీకొని ముగ్గురు మృతి

by Dishafeatures2 |
ట్రాక్టర్ బైకు ఢీకొని ముగ్గురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా తొండంగి మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త ముసలయ్య పేట వద్ద ట్రాక్టర్‌ను బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ముగ్గురు బైక్‌పై ఒంటిమామిడి నుంచి శ్రీరామ్‌పూరం వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు యు కొత్తపల్లి మండలం శ్రీరామ్‌పురం గ్రామస్థులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed