జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

by Dishafeatures2 |
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి 44 వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా ముందు ఉన్నకంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనస్థలిలోనే నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులను మహారాష్ట్రలోని బిలోలి వాస్తవ్యులు గా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed